
kurnool
సెలూన్ షాపులకు చెత్త పన్ను వసూలు నుంచి మినహయింపులు ఇవ్వాలి
సెలూన్ షాపులకు చెత్త పన్ను వసూలు నుంచి మినహయింపులు ఇవ్వాలి
కర్నూలు జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు దనవిజయుడు ఆధ్వర్యంలో ప్రతి మునిసిపల్ పరిది లోని సెలూన్ షాపులకు చెత్త పన్ను వసూలు నుంచి మినహయింపులు ఇవ్వమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి వినతి పత్రం అందిచి నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కల్పించిన సేవా రంగానికి సంబందించిన రాయితీల గురించి వివరించడం జరిగిందని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దులేటి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ DRO నాగేశ్వర్ రావు స్పందించి అందరు కమిషనర్లు కు తక్షణమే దీనికి సంబందంచిన ఆదేశాలు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిలేటి, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, పోలీస్ వెంకటస్వామి, బిజనవేముల నాగేశ్వర్ రావు పాల్గొన్నరు.