Dharmavaram

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం

ధర్మవరం (పల్లె వెలుగు) 05 సెప్టెంబర్: పట్టణములోని 25 వ వార్డులో నివసిస్తున్న దంపెట్ల చిన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి బేల్దారి వృత్తిలో జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ , ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాల మేరకు తక్షణమే అక్కడకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వైయస్సార్ బీమా తరఫున వారి చేతుల మీదుగా పదివేల రూపాయలను అందజేయడం జరిగింది. మున్ముందు కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button