
Pedda Kadubur
గడగడపకు మన ప్రభుత్వం. పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు.
గడగడపకు మన ప్రభుత్వం. పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు.
పెద్దకడబూరు (పల్లెవెలుగు) 04 ఆగష్టు: దేశంలోనే ఎక్కడ లేని విధంగా వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై. బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం ముచ్చుగిరి గ్రామంలో నిర్వహించిన గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. గడగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును గురించి లబ్దిదారులకు వై. బాలనాగిరెడ్డి వివరించారు.