kosigi

అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

అధిక వర్షాలు వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

కోసిగి (పల్లెవేలుగు) 22 అక్టోబర్: అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని,సిపిఐ అనుబంధ సంస్థ అయినా రైతు సంఘం ఆధ్వర్యంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ పంటలు పరిశీలన రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం.గోపాల్ , మండలం సిపిఐ పార్టీ కార్యదర్శి , సహాయ కార్యదర్శి తాయన్న , ఉలిగయ్య ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య , రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం , సిపిఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పంప్పన్న గౌడ్ లు మాట్లాడుతూ గత 20 రోజులు నుంచి ఎడతెరవలేకుండా భారీ వర్షాలు కురవడంతో ఉల్లి, మిరప, పత్తి, వేరుశనగ, తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని , జూన్ నుంచి జూలై నెలలో కురిసిన వర్షాలకు పంటలు బాగా ఉన్నప్పటికి గత 20 రోజుల నుంచి ఎడతెరవక లేకుండా భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులు చాలా నష్టపోయి ,  రైతులు ఖరీఫ్ సీజన్లో బ్యాంకులు తీసుకున్న క్రాప్ రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేయాలన్నారు. అలాగే ఈ వర్షాలు వల్ల నష్టపోయిన రైతులకు పంట బీమా , నష్టపరిహారం ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. అలాగే మిరప పంట ఎకరాకు పెట్టుబడి ఒక లక్ష రూపాయలు , ఉల్లికి యాబై వేలు , పెట్టుబడి పెట్టి రైతుల  పూర్తిగా నష్టపోయారన్నారు.పత్తికి ఎకరాకు నలబైవేలు, వేరుశనగకు మూప్పై వేలు ,పెట్టుబడి పెట్టి రైతుల నష్టపోవడంతో , వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పంటలకు బీమా మరియు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు డీకే, సిద్ధప్ప, ఈరన్న, రాజు, ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు ఎస్.ఈరేష్ మండల సహాయ కార్యదర్శి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button